కుత్బుల్లాపూర్ చింతల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని

Spread the love

కుత్బుల్లాపూర్ చింతల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని చింతల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు..

అనంతరం నూతన అధ్యక్షులు జూలూరి విజయ్ గుప్తా మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

— నూతన కార్యవర్గం ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు..

— నియోజకవర్గంలో అన్ని సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు..

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జూలూరి విజయ్ గుప్తా,ఉపాధ్యక్షులు జూలూరి వీరేందర్ గుప్తా,గోపరపు శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మహంకాళి ప్రభు రాజ్ గుప్తా,కోశాధికారి ఇల్లందుల కృష్ణకుమార్ గుప్తా,సలహాదారులు శివశంకర్ గుప్తా, నారాయణ ప్రసాద్,సత్య ప్రసాద్,సిద్ధి రాములు,భద్రయ్య,రాజయ్య,విజయ్ కుమార్ నాంపల్లి,ఎర్రం రమేష్,శ్రీరామ్ రమేష్,మురళీధర్ గుప్తా తో పాటు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top