వందేళ్ళ కమ్యూనిస్ట్ మహాసభని జయప్రదం చేయండి…..
సిపిఐ (ఎం.ఎల్ )న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ….
పెద్దపల్లి//ఎన్టీపీసి . కమ్యూనిస్ట్ మహా సభ జరిగి వంద సంవత్సరాలు పూర్తి అయినా సందర్బంగా 2026. ఫిబ్రవరి.27న. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎం ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగే సభ ను జయప్రదం చేయాలనీ కోరుతూ..ఎన్టిపిసి . ఐఎఫ్టీయు కార్యాలయం లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా సిపిఐ( ఎంఎల్ ) డెమోక్రసీ జిల్లా నాయకులు చిలుక శంకర్ మాట్లాడుతూ..భారతదేశం ఒక అర్ధ వలస, అర్ధ బుస్వామ్య వ్యవస్థ అని, దీనిని కూల్చివేసి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం విప్లవ పందా మార్గం లో కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కలిసి, నూతన నాయకత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మహాసభ ఏర్పాటు చేశారని, ఆ మహాసభ ఏర్పడి వందేళ్ళు పూర్తి అయినా సందర్బంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సభ ను న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందని, దీనిని విజయవంతం చేయాలనీ చిలుక శంకర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డి.రాజేశం, గుండు. రాజన్న ,జి.కుమారు, ఎస్. చందు, పి. రమేష్ ,కె.మల్లేష్ ,బుక్య కిషన్, డి.రాజ్ కుమార్, పి.తిరుపతి. తదితరుల పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
