
నల్లపరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కిలివేటి సంజీవయ్య..
మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాజీ మంత్రివర్యులు,నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా వారు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుని, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలుపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.ఈ భేటీలో..వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు, రాష్ట్ర అఫ్కాఫ్ మాజీ చైర్మన్ మరియు కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
