గురుపౌర్ణమి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజిన్ పరిధిలోని దత్తత్రయ కాలనీలోని శ్రీశ్రీశ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సాయిబాబా హారతి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పి.ఎల్.ప్రసాద్, బ్రహ్మానంద గౌడ్, పోశెట్టిగౌడ్, జగదీష్, అశోక్, సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్, రామకృష్ణ, నిరంజన్ గౌడ్, శంకర్ గౌడ్, హరీష్, వేరేశం, శరణప్ప, పాపారావు, లక్ష్మణ్ రావు, శశికళ, నాగమణి, మంజుల, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
