ఉయ్యూరు టౌన్
ఈ నెల 15నుండి స్త్రీ శక్తి పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్న కూటమి ప్రభుత్వం:_ తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ .
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు పట్టణ పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాథరావు ఆధ్వర్యంలో ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఇరవయ్యవ మూడు మరియు నాల్గవ వార్డులలో మాజీ ఎమ్మెల్సీ ,తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులువై వి బి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని,కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ నెల 15నుండి అమలు కాబోతుందని ఈ పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారని తెలిపారు,ఇందుకోసం మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ మాజీ చైర్మన్లు జంపాన పూర్ణ చంద్రరావు , కుద్దుస్, PACS చైర్మెన్ కూనపరెడ్డి వాసు, కౌన్సిలర్ తెనాలి పద్మ,తాబేటి మణి బాబు, శివాలయం చైర్మెన్ కుటుంబరావు, జంపన శ్రీనివాస్,సయ్యద్ అజ్మతుల్లా, బూరెల నరేష్, నజీర్,పైడియ్య,మీసాల అప్పలనాయుడు, లంకా అప్పల నాయుడు,నజీర్,భాగ్యరాజు,బాలకృష్ణ,శ్రీకాంత్,వడుపుకార్తీక్, మురాల అయ్యా, బాజాని ,గుర్నాధం,గణేష్,ప్రవీణ్ ,m j రవి,తిరుపతిరావు,దుర్గా ప్రసాద్,చింతయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆయావార్డుల కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
