విజయవాడ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రగతికే ఓటేద్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరిద్దాం అంటూ కూటమి బలపరిచిన MLC అభ్యర్థి ఆలపాటి రాజా ని భారీ మెజారిటీతో గెలిపించవలసిన ఆవశ్యకతపై ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరావు మాజీ MLC అశోక్ బాబు , కడప RTC రీజనల్ ఛైర్మెన్ అబ్జర్వర్ పూల నాగరాజు, సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవ తోటి నాగరాజు, ఘంటా కృష్ణమోహన్ నియోజకవర్గ MLC ఓట్ల కోఆర్డినేటర్ రామకృష్ణ తో కలిసి కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగినది…
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-ఈనెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా కి ప్రధమ ప్రాధాన్యత ఓటు 1 అంకె వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రతి పట్టభద్రుల ఓటర్ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల బాలట్ పేపర్ నమూనా కరపత్రం అందించి,ఓటు వేసే విధానం గురించి అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
