బారికేడ్లు మరిన్ని ఏర్పాటు చేయండి.. జిల్లా ఎస్పీ
యువ నాయకుడు పర్యటన విజయవంతం చేస్తాం.. ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు
అందరికి స్ఫూర్తి నిచ్చేలా తన సంగీతంతో ఆద్యంతం తన స్వారంతో కీర్తనలు పాడుతూ ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసుకున్న ఆధునిక కవి, శ్రీ కృష్ణుడి పరమ భక్తుడు భక్త కనకదాసు 538వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను కళ్యాణదుర్గంలో నిర్వహిస్తుండటం, అక్కడే కనకదాసు 9అడుగుల కాంస్య విగ్రహావిష్కరణను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా జరుగుతుందని అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాదిగా కురుబలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం అయ్యేలా చూస్తామని మడకశిర ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు అన్నారు.. నారా లోకేష్ వేదిక చేరుకునే మార్గంతో పాటు సభావేదిక, విగ్రహం వద్ద చేసిన ఏర్పాట్లు, బారికేడింగ్ ఇతర ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్ తో కలసి దేవినేని ధర్మతేజ , దేవినేని అవినాష్ , మడకశిర ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు పరిశీలించారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
