రూ 200 కోట్లతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్

Spread the love

రూ 200 కోట్లతో నిర్మాణం చేపట్టిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కు రోడ్డు సౌకర్యం కోసం గరిడేపల్లి మండలం, గడ్డిపల్లిలో రూ 20 కోట్లతో గడ్డిపల్లి నుండి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వరకు 5 కిలోమీటర్ల పొడవున డబుల్ లైన్ BT రోడ్డు నిర్మాణానికి నీటి పారుదల & పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం తో గడిపల్లి, కుతుబ్ షాపురం , బొలిశెట్టి వారి గూడెం, చిన్నగారకుంట తండా లకు రోడ్డు సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, SP నరసింహా, RDO శ్రీనివాసులు, R&B EE సీతారామయ్య, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుందరి నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top