టీటీడీకి రూ.18 లక్షల వంట పాత్రలు విరాళం

Spread the love

టీటీడీకి రూ.18 లక్షల వంట పాత్రలు విరాళం

తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తిరుపతికి చెందిన మురళీ అనే భక్తుడు రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట పాత్రలైన సోలా, అర సోలా, పోటు వంట సామాన్లను బుధవారం ఉదయం టిటిడి ఎఫ్ ఏ అండ్ సీఏవో బాలాజీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ ఏ అండ్ సీఏవో బాలాజీ దాత మురళీని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో ఏబీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మ ప్రియ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top