సమస్యలపై స్పందిస్తూ ప్రజల పక్షాన నిలుస్తూ: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు, మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు.. ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా పలు కార్యక్రమాలలో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు..
అదేవిధంగా దుండిగల్ సర్కిల్ బహదూర్పల్లి బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు శివ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
