పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మానవత్వాన్ని చాటుకున్నారు.
దివ్యాంగుల పట్ల ఆమె చూపిన ఉదారత జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రజలు తమ సమస్యల విన్నపం కోసం కలెక్టరేట్ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, కానీ కలెక్టర్ కృతికా శుక్లా అందుకు భిన్నంగా నేరుగా దివ్యాంగుల వద్దకే వెళ్లి వారి విన్నపాలను స్వీకరించారు.
కలెక్టరేట్కు వచ్చిన దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, వారి సమస్యలపై ఆమె ప్రత్యేక శ్రద్ధ వహించారు. వీల్ ఛైర్లపై, ట్రై సైకిళ్లపై వచ్చిన అర్జీదారుల వద్దకు స్వయంగా నడిచి వెళ్లిన ఆమె, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఉన్నత పదవిలో ఉండి కూడా సామాన్యుల పట్ల, ముఖ్యంగా వికలాంగుల పట్ల ఆమె ప్రదర్శించిన ఈ సేవా దృక్పథం మరియు పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
