
వాహన్ పోర్టల్ షురూ.. ఇక ఆన్లైన్లోనే ఆర్టీఏ సేవలు
తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పింది. బండ్ల రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ బదిలీ సహా 52 రకాల సేవలు ఇక ఆన్లైన్లోనే సులభంగా పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు వాహనాల బదిలీకి ఎన్బీసీలు అవసరం లేదు. రెండో బండిపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న 2 శాతం లైఫ్ ట్యాక్స్ను ప్రభుత్వం నేటి నుంచి పూర్తిగా రద్దు చేసింది. ఈ ఆన్లైన్ విధానంతో ప్రజలకు పారదర్శకమైన సేవలు వేగంగా అందనున్నాయి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
