
సింగరేణి కార్మికుల హక్కు – నెలకు ₹10,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి…
– పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ…
పెద్దపల్లి : సింగరేణి కార్మికుల సంక్షేమంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రత్యేకంగా స్పందించారు. సంవత్సరాల పాటు గనుల్లో కష్టపడి పనిచేసిన కార్మికులకు రిటైర్మెంట్ అనంతరం గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు నెలకు కనీసం ₹10,000 పెన్షన్ అందించాలని గట్టిగా డిమాండ్ చేశారు.
“సింగరేణి కార్మికులు తమ జీవితాన్ని గనుల్లో కష్టపడి దేశానికి అంకితం చేశారు. అలాంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కనీస భద్రత కూడా లేకపోవడం బాధాకరం. కనీసం ₹10,000 నెలకు పెన్షన్ ఇవ్వడం వారి హక్కు” అని ఎంపీ పేర్కొన్నారు.
ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు.
చివరగా, “సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్ను వెంటనే అమలు చేయాలి. లేకపోతే వారి హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ హెచ్చరించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
