నీటి సంరక్షణ పోస్టర్ ప్రదర్శన

Spread the love

నీటి సంరక్షణ పోస్టర్ ప్రదర్శన

తిరుపతి / శ్రీకాళహస్తి: తొట్టంబేడు
మండలంలోని దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ స్కూల్ లో
విద్యాశాఖ నిర్వహిస్తున్న జల పక్వాడ కార్యక్రమంలో భాగంగా
విద్యార్థులు, ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం సహకారంతో నీటి సంరక్షణ పోస్టర్ ని తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పాఠశాల
స్థాయిలోనే విద్యార్థులకు నీటి పొదుపు, చెట్లు నాటడంపై అవగాహన కల్గించాలని కోరారు. వర్షపునీరు భూగర్భ జలాలుగా
మారడంలో ఇంకుడు గుంతల ప్రాముఖ్యతను వివరించాలని , వృధా నీటిని అరికట్టాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తాము తయారు చేసిన జల సంరక్షణ పోస్టర్ తో గ్రామంలో నీటిని సంరక్షించండి, చెట్లను కాపాడండి అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.

You cannot copy content of this page

Scroll to Top