ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో మరో మైలురాయి: జయగిరి గ్రామం

Spread the love

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో మరో మైలురాయి: జయగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ జిల్లా, హసన్పర్తి మండలం, జయగిరి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు.
జయగిరి గ్రామానికి చెందిన లబ్ధిదారు జనగాని రమ – చంద్ర కుటుంబం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో తమ స్వంత ఇంటి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు లబ్ధిదారు కుటుంబానికి బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఇంటిలో వారు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంత గృహం కల్పించడం ప్రభుత్వ ముఖ్య సంకల్పమని, జయగిరి గ్రామంలో లబ్ధిదారు కుటుంబం ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఈ గృహప్రవేశ కార్యక్రమం ఆనందోత్సాహ వాతావరణంలో జరిగింది… ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top