
విశేష అలంకరణలో కాశీ విశ్వేశ్వర స్వామి
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: మద్దిరాల మండల పరిధిలోని చందుపట్ల శ్రీ శివరామ క్షేత్రంలో సందర్భంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు విశేష అలంకరణలో భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయ అర్చకులు ముడుంభై రఘువరన్ ఆచార్యులు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి, అనంతరం పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. భక్తుల కోలాహలం మధ్య శివరామ క్షేత్రం అంతటా భక్తి వాతావరణం నెలకొంది. “ఓం నమః శివాయ” నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రత్యేకంగా పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులతో పాటు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
