
ఖమ్మం జిల్లా పోలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు..జిల్లాలో పార్టీ బలోపేతం,ప్రజా సంక్షేమ పథకాల అమలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రభుత్వం – పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం పెంపొందించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్,సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి,ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ,సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కాంగ్రెస్ నాయకులు,ప్రజా ప్రతినిధులు మరియు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
