
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ధన్యవాదాలు తెలిపిన ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్ పికె రామయ్య కాలని ఆటో స్టాండ్ వెనుక గల్లీలో పోయిన ఏడాది వర్షం కారణంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడడం జరిగింది గత పరిస్థితి మళ్ళీ పునరావృతం కావద్దని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి ప్రజల పరిస్థితిని తెలిపిన వెంటనే 25 లక్షల రూపాయల బడ్జెట్ తో టెండర్ నిర్వహించి
3 నెలల క్రితం ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం చెయ్యడం జరిగింది నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కు
ఇళ్లలోకి నీళ్లు రాకుండా నియత్రించడం జరిగింది
మా పికె రామయ్య కాలని ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి, రామగుండం కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ కి ఒకటవ డివిజన్ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ అన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
