విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం… మాజీమంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

Spread the love

విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వం… మాజీమంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

పద్మారావు నగర్ లో ఫీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల భారీ ర్యాలీ

పద్మారావు నగర్ లోని SP కాలేజీ వద్ద నుండి NTR విగ్రహం వరకు సాగిన నిరసన ర్యాలీ

ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు

పీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నది

జిఓ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం

పాలిటెక్నిక్ కాలేజీలకు చెందిన ఆస్తుల కోసం ప్రభుత్వం కుట్రలు చేస్తుంది

ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రజలను మోసం చేసి ప్రజా పాలన అందించామని సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు

పరిపాలన చేతగాక, పాలనను గాలికొదిలేశారు.

కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి రిబ్బన్ లు కట్ చేస్తుండు

ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేదే లేదు

మీ ప్రభుత్వం పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

You cannot copy content of this page

Scroll to Top