వినాయక నవరాత్రి వేడుకలకు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కు ఆహ్వానం….

Spread the love

వినాయక నవరాత్రి వేడుకలకు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కు ఆహ్వానం….

వినాయక నవరాత్రి వేడుకల్లో భాగంగా మహదేవపురం వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేది (ఆదివారం)న మధ్యాహ్నం 12:00 గంటలకు నిర్వహించనున్న “అన్నదాన కార్యక్రమమునకు ఆహ్వానిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈరోజు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ కి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు వారి, వారి నివాసం వద్ద ఆహ్వాన పత్రికలను అందజేశారు.

ఈ ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ సాయి, ప్రెసిడెంట్ కె.వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.సాయి ప్రసాద్, కోశాధికారి నవీన్ రావు, సభ్యులు ప్రవీణ్, యాదగిరి, సింహాచలం, వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top