ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రం : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
ఎస్సీల్లోని 59 ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి, 15శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన ఈ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే గెజిట్ రానుంది.
దీంతో ఇకపై విడుదలయ్యే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యా సంస్థల ప్రవేశాల్లో వర్గీకరణ అమలు కానుంది.
కాగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మాదిగలు పోరాడుతున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
