దుండిగల్ మున్సిపాలిటీ గండిమైసమ్మ డబల్ బెడ్రూమ్ ల నందు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి బోర్ల కోసం జనవరి లో ఇచ్చిన అభ్యర్థన మేరకు నూతనంగా 3 బోర్లు మంజూరు చేయించడం జరిగింది.
10 లక్షల నిధులతో 3 బోర్లు పుంపు సెట్ తో కలిపి సాంక్షన్ వచ్చిoది కాలనీ వాసులతో కలిసి బోర్లు ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏ మల్లేష్ యాదవ్ గోనె మల్లారెడ్డి, ఎంబరి ఆంజనేయులు,డి ప్రభాకర్ రెడ్డి, ఎన్ రోజా, జీ మోహన్ రెడ్డి,ఎం అతీష్ బాబు, తలారి బాలు,గణేష్ అలిమేలు,నాగమణి తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు
కాలనీ వాసులు మాట్లాడుతూ ఇంత త్వరగా సాంక్షన్ వస్తుంది అనుకోలేదు బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కృష్ణారెడ్డి కృషి వల్లనే ఈరోజు ప్రధాన సమస్య మంచి నీళ్లు అది తీరినందుకు ఆనందం వ్యక్తం చేశారు ఇండ్లు వచ్చినాయి అనే ఆనందం తప్ప ఇక్కడ ఉండడానికి చాలా సమస్యలు ఉన్నాయని వాపోయారు ఇంకా పూర్తిగా అందరు రానేలేరు అప్పుడే లిఫ్ట్ లు పనిచేయడం లేదు, డ్రైనేజీ ఎస్ టి పి ఫుల్ అయింది అవుట్ లెట్ లేదు ఈ సమస్యలకు పరిష్కారం చూపమని కోరారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
