శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మి నర్సింహా స్వామి సప్తదశ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కిసరా మండలం ఈశ్వరాపురం గ్రామంలో శ్రీ శ్రీ చీర్యాల లక్ష్మి నర్సింహా స్వామి సప్తదశ 17వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నవకలశ అభిషేకము,అఖండ జ్యోతి స్థాపన, అంకురార్పణలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గోని ప్రత్యేక పూజలు చేశారు..
అనంతరం వేద పండితుల ఆశీర్వచనల మధ్య స్వామివారి ఆశీస్సులు పొందారు..
— ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో సత్కరించారు..
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మి నారాయణ గౌడ్, కిసరా ఎంపిపి ఇందిరా, మల్లవరపు హరి గౌడ్, శివ సాయి గౌడ్, రంగా వెంకటేష్, ఓరగంటి శ్రావణ్, మరియు ఆలయ కమిటీ సభ్యలు, భక్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
