భక్తి, శాంతి, రక్షణకు మార్గం….అయ్యప్ప శరణం: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
128 – చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో శ్రీధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భక్తి, శాంతి, రక్షణకు మార్గం అయ్యప్ప శరణమని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. అంతకు ముందు స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు వరద రాజు, శ్రీశైలం యాదవ్, నరేష్, రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
