కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ||
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలకు సోనియా గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జీడిమెట్ల వాసులు ఆకర్షితులై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆద్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు..ఆదేవింధంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందని, తెలిపారు. ప్రతి తెల్ల కార్డుదారునికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ కార్డుల పంపిణీ, ఏ ప్రభుత్వం చేయని పనిని ప్రజా ప్రభుత్వం పేద ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. కాలనీ సంక్షేమ అభివృద్ధి లో తాను ఎల్లప్పుడు ముందు ఉంటానని తెలియచేసారు.
అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “వల్లాల నవీన్యాదవ్” ని భారీ మెజారిటీతో గెలిపించాలని హాబీబ్, ఫాతిమా నగర్ లో ఇంటి ఇంటికి కల పత్రాలు పంచుతుప్రచారం చేస్తున్న బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
