వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంగారు అలంకరణలో వాసవి దేవి.

Spread the love

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంగారు అలంకరణలో వాసవి దేవి.

అంగరంగ వైభవంగా పల్లకి సేవలో వాసవి అమ్మవారు

కోవూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంగారు అలంకరణలో వాసవి దేవి అమ్మవారు. ప్రధానార్చకులు నందకిషోర్ సమక్షంలో అమ్మవారికి నైవేద్యాలు, మంగళ హారతులు పరిమళ పుష్పాలతో పూజలు సాంప్రదాయబద్ధంగా సమర్పించారు.ఉభయ నైవేద్యాలు హరిత క్యాటరింగ్ సుబ్బారావు కొడుకు నటుకుల సురేంద్ర, మానస దంపతులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించుకున్నారు. అనంతరం వాసవి దేవి అమ్మవారికి పల్లకి సేవ మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో, అంగరంగ వైభవంగా జై వాసవి మాత నామ స్మరణతో జరిగింది. వచ్చిన భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుని పుణ్యహితులు అయ్యారు. అనంతరం ప్రతి ఒక్కరికి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, మరియు వాసవి మహిళా కోలాట భక్త బృందం, తదితరులు పాల్గొనడం జరిగింది.

You cannot copy content of this page

Scroll to Top