శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ సతీమణి,

Spread the love

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నరేందర్ యాదవ్ సతీమణి, దివంగత కీర్తిశేషులు రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాగం నరేందర్ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా జగద్గిరిగుట్టకు చెందిన మహేందర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో, వారి నివాసానికి వెళ్లిన కూన శ్రీశైలం గౌడ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు

You cannot copy content of this page

Scroll to Top