
సాయిబాబా నగర్, 292 డివిజన్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి వినతి పత్రం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేసింది.
నిరుద్యోగులకు, విద్యార్థులకు, రైతులకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని నిరసిస్తూ BRS పార్టీ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ప్రజల సమస్యలపై ప్రశ్నిద్దాం – ప్రజల హక్కుల కోసం పోరాడుదాం అనే నినాదంతో మేడ్చల్-మల్కాజ్ గిరి BRS పార్టీ అధ్యక్షులు MLC శంబీపూర్ రాజు మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
రాజ్ కుమార్ ముదిరాజ్, తారా సింగ్, గట్టు అశోక్, భాస్కర్, రాజు యాదవ్, నారాయణ, చిన్న వెంకటస్వామి, బైరీష్ గౌడ్, మజీద్ పాషా, బద్రి, హయత్ పాషా, జహీర్, మునీర్, అనిల్, గణేష్, రవి తదితర BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
