రేపు ఇంట్లో ఏం చేయాలంటే
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని పండితులు చెబుతున్నారు. తర్వాత స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. అనంతరం సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న సమేత ఆంజనేయుడికి షోడశోపచార పూజ చేయాలి. పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించాలి. అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన చేయాలి. ఐదు దీపాలను తప్పకుండా వెలిగించాలి. రాముడిని మనసులో నిలుపుకుని పూజాదికాలు చేయాలి.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-6.39.06-PM-574x1024.jpeg)