
ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు సంతాపం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ డి.పోచంపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆనబోయిన రాజశేఖర్ యాదవ్ తల్లి ఆనబోయిన అంజమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు . ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివంగత ఆత్మకు శాంతి చేకూరాలని తన మద్దతును మరియు ధైర్యాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేష్, భాస్కర్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి, సర్కిల్ జనరల్ సెక్రెటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, పాక్ వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, నాయకులు మైసయ్య గౌడ్, బైండ్ల గోపాల్, శ్రీకాంత్ యాదవ్, కట్టా సుందర్ బాబు, కుసుంబ, సాంబ రాజు, శేఖర్, మరియు స్థానికులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
