
ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు…!
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్…!
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి మంథని,
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంథని సింగిల్ విండో కార్యాలయం లో సంఘ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ..రజాకార్ల అరాచకా లు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో అసువు లు బాసిన అమర వీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి ని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా పాలన దినోత్స వాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు ఆకుల రాజబాబు, దాసరి లక్ష్మీ మొండయ్య, సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్య, సంఘ సిబ్బంది దుబ్బాక సదాశివ్, బెజ్జెంకి సదానంద్, నారమల్ల విద్యాసాగర్, కొత్త స్వప్న, పైడాకుల రాకేష్, గూడెల్లి మధు మోహన్, మోతుకూరి సాగర్, నారమల్ల చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
