TEJA NEWS

40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై

వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై వెంకన్న ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎస్సై గుగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తండా బెల్లం వ్యాపారుల ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


TEJA NEWS