TEJA NEWS

అర్జీదారులు సంతృప్తి పడేలా సమస్యలు పరిష్కరించండి.
*కమిషనర్ ఎన్. మౌర్య.

తిరుపతి : అర్జీదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం నిర్వహించగా 60 మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతుల రూపంలో అందజేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నిర్వహించిన పి.జి.ఆర్.ఎస్. కార్యక్రమంలో 60 మంది నుండి వినతులు అందాయని అన్నారు. ఇందులో మఖ్యంగా ఇండ్లు కోసం డబ్బులు కట్టామని, మాకు డబ్బులయినా, ఇల్లు అయినా ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి తెలిపామని త్వరలో నిర్ణయం వస్తుందని అన్నారు. అలాగే తమకు టిడిఆర్ బాండ్లు ఇవ్వాలని, భూగర్భ డ్రైనేజి మరమ్మతులు చేయించాలని కోరారని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలని, అక్కడక్కడా ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని కోరారని అన్నారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారులు వెళ్లి పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, సెక్రటరీ రాధిక, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, రాజు, శ్రావణి, ఆర్.ఓ.లు సేతు మాధవ్, కే.ఎల్.వర్మ, డి.సి.పి.శ్రీనివాస రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS