TEJA NEWS

పాసిగామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు.
ధర్మపురి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన
14 కుటుంబాలు 62 మంది ప్రజలను అధికారులు
హరిత హోటల్ కి తరలించారు. ఈ సందర్భంగా
అధికారులు మాట్లాడుతూ.. మూడు రోజుల నుంచి
కురుస్తున్న భారీ వర్షాలకు పాశిగామ గ్రామంలోని
వాగుకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు
తరలించినట్లు తెలిపారు. సీఐ రామ నరసింహారెడ్డి,
ఎస్ఐ ఉమా సాగర్, తహశీల్దార్ శేఖర్, ఎంపీఓ
శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS