
సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య,గారి జన్మదిన కార్యక్రమాలు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ శ్రీ హేమ దుర్గాభవన్లో జరిగాయి .ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని లక్ష్మయ్య చేత కేక్ కటింగ్ చేయించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు సముచిత గౌరవం ఉంటుందని,వారికి మంచి పదవుల లభించే లాగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు నాయకులకు మంచి పదవులు లభిస్తాయి అని పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో, గాలి బాలాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, సాయిబాబా చౌదరి, ధర్మ రావు, మస్తాన్ రెడ్డి, కనకయ్య,పిడికిటి గోపాల్ చౌదరి, కామినేని వాసు, మేకల మహేష్, నసీర్, మోహన్ నాయక్, బండి సుధా, సంధ్య, కల్పన, అపర్ణ , జయలక్ష్మి, రాజేశ్వరి, ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, దానలక్మి,రజని, నాగమణి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.