
పోలీస్ ప్రజావాణి కి 25 ఫిర్యాదులు
ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించిన……. జిల్లా ఎస్పీ సునీత రెడ్డి
వనపర్తి :
ప్రతి సోమవారం పోలీస్ జిల్లా కార్యాలయంలో విధిగానిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుండి 25 ఫిర్యాదులు అందాయని ప్రతి ఫిర్యాదు పై పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందిస్తూ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం జరగాలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తే బాధితులకున్యాయం జరుగుతుందని భరోసాను కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ కోరారు అందిన ఫిర్యాదుల్లో 17 భూ తగాదాలు, 8 పరస్పర గొడవలు సంబంధించిన ఫిర్యాదులు అందాయని తెలిపారు.