
జపాన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
AP: అమరావతిలో జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైనట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చలు జరిగాయి. నౌకానిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొనసాగాయి” అని ట్వీట్ చేశారు.
