టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్

TEJA NEWS

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు.

మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయత్ నగర్ లోని మధుయాష్కి గౌడ్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మధుయాష్కీ కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు అనసూయ చిత్రపటానికి నివాళులర్పించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts