TEJA NEWS

పల్నాడు జిల్లా

రేపు కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

ప్రతి నెల నాలుగోవ శనివారం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను యథావిధిగా రేపు (ఏప్రిల్ 26, శనివారం) ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు.

జిల్లాలోని ఎస్సీలు, ఎస్టీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.