
హైవేపై కంటైనర్లారీ భీభత్సం..
– వాహనంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం
– తిమ్మాపురం శివారులో రోడ్డు ప్రమాదం
– డ్రైవర్ నిద్రమత్తుతోనే ఘటన
– తప్పిన పెనుప్రమాదం
సాక్షిత రూరల్ :యడ్లపాడు మండలం తిమ్మాపురం శివారులో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి గుంటూరు దిశగా వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ లారీ, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా అదుపుతప్పి నేరుగా హైవే సెంట్రల్ డివైడర్పై ఎక్కింది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఇనుప స్తంభాన్ని ఢీకోవడంతో వాహనం ముందు భాగంతో పాటు స్తంభానికి బిగించిన సీసీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ఇనుప స్తంభాలను తొలగించి రహదారి మీద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న సమయం కావడం, వా హనాల రద్దీ లేకపోవడం, ఎవరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ అలసట, నిద్ర మత్తే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ధ్వంసమైన నేపథ్యంలో, యుద్ధప్రాతిపదికన వాటిని తొలగించి ట్రాఫీక్ను సరళీకృతం చేసినట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు.
