Spread the love

విజయవాడ కనక దుర్గమ్మకు రూ.2.28 కోట్ల కానుకలు

విజయవాడ : ఏపీలోని ఇంద్ర కీలాద్రిపై కనక దుర్గమ్మకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. జనవరి 21 నుంచి ఈనెల 5 వరకు 16 రోజులకు నగదు రూ.2,28,81,128, బంగారం 328 గ్రాములు, వెండి 3 కిలోల 480 గ్రాములు, ఆన్లైన్ ద్వారా రూ.78,333 కానుకలు, ఇంకా విదేశీ కరెన్సీ సమకూరిందని ఆలయ ఈఓ రామచంద్ర మోహన్, డిప్యూటీ ఈఓ రత్నరాజు వెల్లడించారు.