ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరు ఉందని వద్దంటే ఎలా?: సుప్రీం కోర్టు

ఒకే పేరున్న అభ్యర్థులు ఒకే స్థానంలో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు స్పందించింది. ‘తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎలా అడ్డంకి అవుతుంది? వాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటే వాళ్ల హక్కును ఉల్లంఘించినట్లు కాదా? రాహుల్ గాంధీ పేరుతో మరో వ్యక్తి ఉంటే అతడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా ఆపగలం’ అని ప్రశ్నించింది.

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో … సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్‌ చేసింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది

CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ

CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణ

Mar 19, 2024, ‘CAA’పై పిటిషన్‌లు.. ఇవాళ సుప్రీం విచారణకేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. CAAపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌లను విచారించనుంది.

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు. అదనపు సొలిసిటర్ జనరల్‌గా 1972-75 మధ్యకాలంలో పని చేశారు. 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి. రాజ్యసభ సభ్యుడిగా, బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు…

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది

బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. 11 మంది దోషులకు క్షమాభిక్ష రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల శిక్షను తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను తప్పుబడుతూ కీలక నిర్ణయాన్ని వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్‌ బానో కేసులో గుజరాత్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 2002నాటి గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌ బానో పై అత్యాచారానికి ఒడిగట్టిన 11 మంది రేపిస్టులను విడుదల చేస్తూ, గుజరాత్‌…