
తప్పుల నుంచి ఏం నేర్చుకున్నామో అదే ముఖ్యం: నారా లోకేష్
పెన్షన్ డబ్బులతో పరారైన పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయ ఉద్యోగి లక్ష్మీ ప్రసాద్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆన్లైన్ బెట్టింగులతో మోసపోయానని, నెల రోజులు టైం ఇస్తే డబ్బులు చెల్లిస్తానన్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మనుషులు తప్పులు చేస్తారని, వాటి నుంచి ఏం నేర్చుకున్నామనేది ముఖ్యమన్నారు.తనకు రక్షణ కల్పిస్తామని, ఒక అవకాశం కల్పిస్తున్నట్లు తాను తిరిగి క్షేమంగా ఇంటికి రావాలన్నారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు..
