Spread the love

తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50,000: టీడీపీ ఎంపీ కలిశెట్టి

విజయనగరం : ఏపీలో మూడో బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆఫర్ ప్రకటించారు. మూడో సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50,000, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును, దూడ ను బహుమానంగా ఇస్తానని ఓ కార్యక్రమంలో తెలిపారు. ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.ఐతే ఈ ఆఫర్ తన పార్లమెంట్ నియోజకవర్గం విజయనగరం పరిధిలో మాత్రమే శాశ్వతంగా అమలుచేస్తానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.