
దమ్మపేట పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు,
అశ్వరావుపేట నియోజకవర్గం అశ్వరావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం.
అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట(నియోజకవర్గం),దమ్మపేట మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు.ముందుగా దమ్మపేట మండల కేంద్రంలో అత్తులూరి పాపారావు ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రంగు గాంధీ కోడలు ఇటీవలే కరెంట్ షాక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు.అనంతరం అప్పారావుపేట(గ్రామం)లో బుద్దా వెంకన్న ఇటీవలే మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట నియోజకవర్గ నాయకులు దారా యుగంధర్,మాజీ వైస్ ఎంపిపి దారా మల్లికార్జున రావు,అబ్దుల్ జిన్నా,ఉయ్యాల లక్ష్మి నారాయణ,విష్ణు తదితరులు ఉన్నారు.
