Spread the love

హోంమంత్రి అనితకు లేడీ కానిస్టేబుల్ ప్రశ్న

మంచి ప్రశ్న అడిగారని ప్రశ్నించిన కానిస్టేబుల్ ని మెచ్చుకున్న HM

ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళతానన్నారు

విజయవాడలో పోలీసులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

అక్కడ మహిళా పోలీసులకు ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అడగొచ్చన్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రసూతి సెలవులు గురించి అడిగారు. మూడో బిడ్డను కంటే సెలవు ఇవ్వరా అంటూ అడిగారు.. చాలా మంచి ప్రశ్న అంటూ హోంమంత్రి అనిత కానిస్టేబుల్‌ను మెచ్చుకున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్హంగా విజయవాడ పోలీసులు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేడుకలు నిర్వహించగా.. హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళా పోలీసులను వారి సందేహాలు, ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగమంటూ హోంమంత్రి అవకాశం ఇచ్చారు. అయితే శ్రుతి అనే లేడీ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి ఫిదా అయ్యారు.

‘మేడం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువమందిని కనమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకే ప్రసూతి సెలవు ఇస్తున్నారు.. మరి మూడో బిడ్డను కనేవారికీ ప్రసూతి సెలవులను ఇస్తారా?’ అంటూ హోంమంత్రి వంగలపూడి అనితను కానిస్టేబుల్ శ్రుతి ప్రశ్నను అడిగారు. వెంటనే స్పందించిన హోంమంత్రి.. చాలా మంచి ప్రశ్న అడిగారని ప్రశంసించారు. కానిస్టేబుల్ శ్రుతిని మెచ్చుకుని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తాను తీసుకెళ్తానని చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో రాష్ట్రంలో ఎక్కువమంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అన్నారు. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోయే అవకాశం ఉgదన్నారు. సఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తగ్గింది’అన్నారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ మూడో బిడ్డను కంటే ప్రసూతి సెలవులు ఇస్తారా అని ప్రశ్నించారు.

మరో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతార్జీతయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు నా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ కాదు. ఇది సమాజ బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 2025- 26 వార్షిక బడ్జెట్ లో మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా రూ. 4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశాం. అలాగే ‘దీపం 2’ స్కీమ్ కింద 90.1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అంగన్ వాడీ సెంటర్ల బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పనిచేస్తున్నాం. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం. మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ… మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.