
2’50’000 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి(LOC) అందజేత
కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న కోడిరెక్కల రామారావు. S/o నాగయ్య. వయస్సు 45 సంవత్సరాలు, కిడ్నీ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి భార్య రత్నకుమారి కూకట్పల్లి లోని GVR కార్యాలయం లో సంప్రదించగా వారికి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయడం జరిగింది.. వారికి 2,50,000 రూపాయల LOC మంజూరు అయ్యింది..
ఆ LOC లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు(GVR) చేతుల మీదుగా రామారావు భార్య రత్నకుమారి కి అందజేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్, శివ చౌదరి,బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా రత్నకుమారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్ కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) కు కృతజ్ఞతలు తెలియజేశారు….
