TEJA NEWS

చిలకలూరిపేట :విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయములో గృహవసారాలకు వినియోగించు విద్యుత్ సర్వీసులకు అదనపు లోడు పెంచుకొనుటకు విద్యుత్ శాఖ వారు కిలోవాట్ కు డెవోలోప్మెంట్ చార్జిలలో 50% రాయితీ కల్పించారు.* విద్యుత్ వినియోగ దారులు తీసుకొన్న లోడ్ కంటే అధిక లోడు వాడుచున్నచో సమీపంలో వున్న విద్యుత్ రెవిన్యూ కార్యాలయమునందు సంప్రదించి 30-06-2025 లోపు అదనపు లోడులో వున్న డెవోలోప్మెంట్ చార్జీ లో 50%రాయితితో లోడుని క్రమబద్దించుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై. ఏడుకొండలు, సి ఆర్ డి ఏ సర్కిల్ సీనియర్ గణాంకాధికారి అజయ్ కుమార్ లు ఈ సందర్బంగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్, అసిస్టెంట్ గణాంకాధికారి చంద్రశేఖర్ ఏ ఈ లు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.