
ప్రధాని నరేంద్ర మోదీని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన పుస్తకాన్ని బహుకరించారు. ఈ పుస్తకం ఏఎన్ఆర్ యొక్క సినీ ప్రస్థానం, సమాజానికి అందించిన సేవలు, మరియు ఆయన ప్రభావాన్ని వివరిస్తుందని మోదీ తెలిపారు. పార్లమెంట్ హౌస్లో జరిగిన సమావేశంలో అక్కినేని నాగార్జున ప్రధాని మోదీకి “మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం” అనే పుస్తకాన్ని అందజేశారు.
