TEJA NEWS

5న ఏపీ లాసెట్ పరీక్ష
** మీడియాతో మహిళా వర్సిటీ వీసీ

తిరుపతి: ఏపీ లాసెట్ అండ్ పీజీ లా సెట్ -2025 పరీక్షలు ఈనెల 5వ తేదీ జరుగుతాయని తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.ఉమ, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ టి.సీతా కుమారి తెలిపారు. వాళ్లు మహిళా విశ్వవిద్యాలయంలో మీడియాతో సమావేశమై వివరాలు వెల్లడించారు. 5వ తేదీ గురువారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం మొత్తం 27,253 మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని…వారిలో 3 సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్సుకు 19,973 మంది, 5 సంవత్సరాల ఎల్.ఎల్.బికి 4,794 మంది, పీజీ ఎల్.ఎల్.ఎమ్ కోర్సుకు 2,486 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. మొత్తం అభ్యర్థుల్లో పురుషులు – 17,983, స్త్రీలు – 9,269, ట్రాన్స్జెండర్ – 1 అభ్యర్థి ఉన్నారని వివరించారు. సామాజిక వర్గాల ప్రకారం, అత్యధికంగా ఓసీ నుండి 7,849, ఎస్సీ – 6,770, బీసీ(డీ )– 3,675, బీసీ (ఏ )- 3,094 దరఖాస్తులు అందాయన్నారు.
133 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబడనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల్లో సాంకేతిక, భద్రత, లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రొఫెసర్ ఉమా తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె చెప్పారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, గుర్తింపు పత్రాలతో పాటు సమయానికి ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ సీత కుమారి సూచించారు. ఫలితాలు జూన్ చివరిలో విడుదలయ్యే అవకాశముందని తెలిపారు.


మరిన్ని తాజా వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను తరచుగా సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.తిరుపతిలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్, అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయన్నారు. ఈ ప్రెస్ మీట్‌లో డా. ఎన్. శ్రీరజని, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ పాల్గొన్నారు.